దేశంలో మొదటిసారిగా కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభించినప్పుడు చాల మంది ఈ టీకా ఇప్పించుకోవడానికి సందేహించారు.కొన్ని అపశృతులు కూడా దొర్లాయి.
కానీ ప్రస్తుతం ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే దేశంలోని ప్రముఖులంతా కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక మార్చి 1వ తారీఖు నుండి ఈ వ్యాక్సినేషన్ పక్రియలో వేగం పెరిగింది.
ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకాలు వేస్తుండటంతో చాల మంది దీనికోసం క్యూ కడుతున్నారు.ఇకపోతే దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకు పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తాజాగా కేంద్రం తెలిపింది.ఈమేరకు గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.ఇక దేశంలో జనవరి 16న టీకాల పంపిణీ మొదలైన విషయం తెలిసిందే.కాగా ఇప్పటి వరకు 60 ఏళ్లు పైబడిన 14.95 లక్షలు, 45 ఏళ్లు పైబడిన 2.18 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు వెల్లడించారు.