ఇన్నేళ్ళకి ఓ మంచి పని చేస్తున్న పాకిస్తాన్

ఒకప్పుడు కాశ్మీర్ అంటే బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే ప్రదేశం.అలాగే పాకిస్తాన్ లో కూడా హిందువులు లక్షల సంఖ్యలో ఉండేవారు.

 Reconstruction Of Destroyed Hindu Temple In Pakistan Begins-TeluguStop.com

ప్రస్తుతం భారత్ లో ఎక్కువగా గిరిజన తెగలు ఉంటే, పాకిస్తాన్, హిమాలయాల ప్రాంతాలలో బ్రాహ్మణులు, ఇతర హిందు కమ్యూనిటీకి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.అయితే తరువాతి కాలంలో ఆ ప్రాంతంలో ముస్లింల ఉనికి ఎక్కువ కావడం జరిగింది.

ఇక భారత్ నుంచి పాకిస్తాన్ వేరు పడిన తర్వాత అదంతా ముస్లింల దేశంగా మారిపోయింది.

ఆ సమయంలో పాకిస్తాన్ లో ముస్లిం వర్గాల నుంచి లక్షల సంఖ్యలో హిందువులు ఊచకోతకి గురయ్యారు.

కొంత మంది పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇండియాలోకి వచ్చేసారు.అయితే అప్పట్లో ఉన్న హిందూ ఆలయాలని కూడా అప్పటి ముస్లిం పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ ద్వంసం చేసేసారు.

ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ వాటిని పునరుద్ధరించే ప్రయత్నం మొదలెట్టాడు.సుమారు 400 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆలయాల పునరుద్ధరణ తర్వాత వాటిని హిందువులకు అప్పగించనున్నారు.మొత్తానికి ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ లో హిందువులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube