అప్పుడప్పుడు కొన్ని రకాల వస్తువులు త్వవకాల్లో బయటపడితేనే మనం చాలా ఆశ్చర్యపోతుంటాం.ఇక కొన్ని సార్లు అయితే ఏవేవో వింత వస్తువుల కనిపిస్తూ మనల్ని షాక్ కు గురిచేస్తుంటాయి.
ఇక సొరంగాలు బయటపడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఇక ఇప్పుడు కూడా ఢిల్లీ లో ఇప్పేఉడు భారీ సొరంగం గుర్తించినట్టు తెలుస్తోంది.
అయితే అది కూడా సాక్ష్యాత్తు ఢిల్లీ లోని అసెంబ్లీ దగ్గర ఇది బయట పడటం ఇప్పుడు సంచలనం రేపుతోంది.అయితే ఇది అసెంబ్లీ దగ్గరి నుంచి నేరుగా ఎర్రకోటకు మార్గాన్ని నిర్మించినట్టు పురావస్తు శాఖ ఆఫీసర్లు తెలుపుతున్నారు.
కాగా దీన్ని మాత్రం స్వాతంత్ర్య ఉద్యమకారుల పోరాటం సందర్భంగా వారిని ఎలాగైనా అణచివేసేందుకు బ్రిటీషర్లు ఇలాంటి సొరంగాలను అప్పట్లో చాలా ఉపయోగించారని కాగా ఇది కూడా అలాగే వారు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.కాగా ఈ సొరంగం అసెంబ్లీ దగ్గరి నుంచి నేరుగా ఎర్రకోట వరకు ఉండటం ఇక్కడ ప్రత్యేకమైన అంశంగా చెప్పొచ్చు.
స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటీషర్లపై ఎదురు తిరిగినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు అప్పట్లోనే బ్రిటీషర్లు ఇలాంటి సొరంగాలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ కూడా వివరించడం గమనార్హం.ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 1993లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ సొరంగం గురించి ఎన్నో రకాలుగా చెప్పేవారని, అప్పట్లోనే దీని చరిత్ర గురించి తాను ఎంతో తెలసుకునేందుకు ట్రై చేసినా పెద్దగా ఫలితం లేకపోయిందని, కానీ ఇప్పుడు టన్నెల్కు చెందిన ముఖ ప్రదేశాన్ని కనిపెట్టినట్టు వివరించారు.అయితే ఆ టన్నెల్ను మాత్రం ఇప్పుడు ఎలాంటి తవ్వకాలు చేయకుండా అలాగే ఉంచుతామని తెలిపారు.
ఎందుకంటే ఇప్ఉపడు అక్కడ మెట్రో పిల్లర్లు ఉన్నాయి.కాగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.