యంగ్ రెబల్ స్టార్..
ప్రస్తుతం ఈయన నేషనల్ వైడ్ పాపులర్ స్టార్ గా పేరు పొందాడు.బాహుబలి సినిమా తో నేషనల్ వైడ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా ఏమిటో చూపించిన తర్వాత సాహో సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగా నిర్మించి బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక పొతే ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక ఈ సినిమాకి వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది.
అయితే తెలిసిన సమాచారం మేరకు ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కబోతోందని టాలీవుడ్ టాక్.ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే నటించబోతోంది.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది.
అదేంటంటే.
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు అని.తాజాగా ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ఓ వీడియోని రిలీజ్ చేస్తూ “లెజెండ్ అమితాబచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించాలి” అంటూ విడుదల చేసింది.ఈ వీడియోను తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేస్తూ ఎట్టకేలకు “నా కల నిజం కాబోతోంది.దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి తాను నటించబోతున్నట్టు ప్రభాస్ తెలిపాడు.
ఏది ఏమైనా బాలీవుడ్ ప్రపంచానికి చాలా దగ్గర అవుతున్నాడు హీరో ప్రభాస్.అలాగే ఆదిపురుష్ సినిమాతో మరో భారీ సినిమాను కూడా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.