యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా అని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ కావడంత ప్రేక్షకులు ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా నటిస్తున్నాడనే వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వార్తపై కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.జనవరి 20న పుట్టినరోజు జరుపుకున్న కృష్ణం రాజు తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
రాధేశ్యామ్ చిత్రంలో ఆయన పరమహంస అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.మహాజ్ఞాని, గొప్ప వ్యక్తి అయిన పరమహంస పాత్ర కోసం ఆయన రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్నాడని, అందుకే గడ్డం పెంచినట్లు కృష్ణం రాజు తెలిపారు.
అయితే ప్రభాస్తో పాటు ఆయన నటించే సీన్స్ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉందని, త్వరలోనే అది ముగించేసి ఈ సినిమాను పూర్తి చేస్తామని కృష్ణం రాజు తెలిపారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.
మొత్తానికి రెబల్ స్టార్తో పాటు యంగ్ రెబల్ స్టా్ర్ను మరోసారి వెండితెరపై ఒకేసారి చూడబోతున్నట్లు క్లారిటీ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఇక రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.