తెలుగుదేశం పార్టీలోనే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఒక సందేహం క్లారిటీ లేకుండా ఉంది.తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని విషయంలో ఎన్టీఆర్ స్పందన ఎవరికీ అర్ధం కావడంలేదు.
అసలు చంద్రబాబు కూకట్ పల్లి నియోజకవర్గం సీటును కేవలం జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చాడనే సంగతి అందరికి తెలుసు.నందమూరి కుటుంబం లో ఎవరో ఒకరికి సీటు ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడని…ఆ ప్రభావం ఏపీ ఎన్నికల్లో కూడా కనిపించి టీడీపీ విజయావకాశాలు మెరుగవుతాయని చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేసాడు.
అయితే ఆ స్కెచ్ ముందుగానే అర్ధం చేసుకున్నాడో ఏమో కానీ ఎన్టీఆర్ మాత్రం తన అక్క ప్రచారానికి ముందుకు రావడంలేదు.
అదిగో ఎన్టీఆర్ ప్రచారానికి వస్తున్నాడు .ఇదిగో ప్రచారానికి వస్తున్నాడు అంటూ… ప్రచార షెడ్యూల్ కూడా కొన్ని మీడియా ఛానెల్స్ ప్రచారం చేశాయి.అయితే విషయం ఏంటి అంటే… జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. తన సోదరికి ప్రచారం చెయ్యాలని ఆయన మీద గట్టిగా ఒత్తిడి ఉన్నా వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట.దీనితో ఇప్పటికే సోదరిని గెలిపించాలని ప్రకటన చేసి సరిపెట్టుకున్నారు.అయితే ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదా? కాదా అనేదాని పై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం టీడీపీ కష్టకాలంలో ఉన్నందున ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చి ఉంటే ఆ టీడీపీలో మంచి గుర్తింపు ఉండడంతో పాటు ఆ తరువాత పార్టీలో మంచి అవకాశం దొరికి ఉండేది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు పార్టీని గెలిపించినా ఇప్పట్లో రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ప్రచారానికి వచ్చినా ఎన్టీఆర్ కి పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఏమీ లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా…జూనియర్ ప్రచారానికి రాకపోవడం వలన నందమూరి కుటుంబంలో విబేధాలు తలెత్తే అవకాశం కూడా ఉన్నట్టు మరికొంతమంది అంచనా వేస్తున్నారు.హరికృష్ణ మరణం తరువాత ఆయన కూతురు రాజకీయాల్లోకి వస్తుంటే… సొంత కుటుంబ సభ్యులే ఆమెకు అండగా నిలవలేకపోతున్నారు అనే అపవాదు జూనియర్ మోయాల్సి ఉంటుంది అని మరికొంతమంది టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.