టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకున్న నటులలో తొట్టెంపూడి వేణు కూడా ఒకరు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన వేణు ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు.
నటుడిగా ఒక వెలుగు వెలిగిన వేణు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు ప్రేక్షకులకు జవాబు దొరకడం లేదు.యూట్యూబ్ ఛానెళ్లకు కూడా వేణు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.
స్వయంవరం సినిమాతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణుకు ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వేణు హీరోగా కొంతకాలం బాగానే కెరీర్ ను కొనసాగించినా ఆ తర్వాత ఆఫర్లు తగ్గాయి.
ప్రస్తుతం వేణు చిత్రరంగానికి పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.మొదట్లో ఇంజనీర్ కావాలని అనుకున్న వేణుకు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి కలిగింది.
భారతీరాజా డైరెక్షన్ లో ఒక సినిమాకు వేణు మొదట ఎంపిక కాగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
దమ్ము సినిమాలో వేణు ఎన్టీఆర్ బావగా కనిపించారు.అన్ని రకాల పాత్రలు పోషించకపోవడం వేణుకు మైనస్ అయింది.రామాచారి అనే సినిమాలో వేణు చివరగా హీరోగా నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.2001 సంవత్సరంలో వేణుకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వేణు భార్య అనుపమ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.ప్రస్తుతం వేణు భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది.మంచి అవకాశాలు వస్తే తాను నటించడానికి సిద్ధమేనని వేణు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వేణుకు మంచి పాత్రలు లభిస్తే మాత్రం త్వరలోనే వేణు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.