బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగెస్ట్ కంటెస్టంట్లలో ఒకరైన సోహైల్ 25 లక్షల రూపాయలు తీసుకుని ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి కథ వేరే ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పిన సోహైల్ తను తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో గ్రాండ్ ఫినాలేను మలుపు తిప్పారు.
ఒకవేళ 25 లక్షల రూపాయలు సోహైల్ తీసుకోకపోయి ఉంటే మాత్రం అభిజిత్ విన్నర్ గా సోహైల్ రన్నర్ గా నిలిచేవాడని రన్నర్ అయినా అతనికి ఒక్క రూపాయి కూడా వచ్చేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒకరైన మెహబూబ్ సైగలతో చెప్పడంతో వల్లే సోహైల్ 25 లక్షలు తీసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నా సోహైల్ అభిమానులు మాత్రం అతను బిగ్ బాస్ షోను సరిగ్గా అర్థం చేసుకుని కుటుంబ సభ్యుల మాట వినే సోహైల్ 25 లక్షలు తీసుకున్నాడని చెబుతున్నారు.
ఆ 25 లక్షలలో పది లక్షలు అనాథలకు ఖర్చు చేస్తానని చెప్పి సోహైల్ టైటిల్ గెలవలేకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం గెలుచుకున్నాడు.
నాగార్జున మరో పది లక్షలు, చిరంజీవి మరో పది లక్షలు ప్రకటించడం ద్వారా సోహైల్ ఎంతోమంది అనాథలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరడానికి కారణమయ్యాడు.నిజానికి బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని నమ్మకం ఉంది. బిగ్ బాస్ షోను సరిగ్గా అర్థం చేసుకుని సోహైల్ డబ్బుతో పాటు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు.
ఇప్పటికే సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన సోహైల్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపును ఉపయోగించుకుని భవిష్యత్తులో హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేయనున్నాడు.సోహైల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తానని కుదిరితే సోహైల్ సినిమాలో చిన్న పాత్రలో నటిస్తానని చెప్పి చిరంజీవి గ్రాండ్ ఫినాలేలో ఆకట్టుకున్నారు.