టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన ఢీ షో ద్వారా శేఖర్ మాస్టర్ కు పాపులారిటీ దక్కింది.
ఢీ షోకు జడ్జిగా గత కొన్ని సంవత్సరాలుగా శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు.శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ సైతం పర్ఫెక్ట్ గా ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే కామెడీ స్టార్స్ షోకు శేఖర్ మాస్టర్ జడ్జిగా చేయడంతో ఢీ షోకు దూరం కావాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఢీ షోకు గణేష్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు.
ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ వెళ్లిపోయిన తర్వాత ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కూడా శేఖర్ మాస్టర్ కనిపించలేదు.అయితే తాజాగా ఈటీవీ ఛానల్ లో దసరా కానుకగా ఒక ఈవెంట్ ప్రసారం కానుండగా అందులో శేఖర్ మాస్టర్ కనిపించారు.
శేఖర్ మాస్టర్ మళ్లీ ఈటీవీ గూటికి చేరడం గమనార్హం.దసరా బుల్లోళ్లు పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
యాంకర్ ప్రదీప్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా శేఖర్ మాస్టర్ ఈ షోలో డ్యాన్స్ స్టెప్పులు వేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.
దసరా పండుగ రోజున ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.ఢీ షోలోకి శేఖర్ మాస్టర్ జడ్జిగా రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.ప్రముఖ నటి రోజా సైతం ఈ షోలో పాల్గొనడం గమనార్హం.
గతంలో రోజా, శేఖర్ మాస్టర్ కలిసి చేసిన ఈవెంట్లు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు శేఖర్ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ గా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమాలోని ఎక్కువ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.