ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన జమున మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.అయితే జమునకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ తో వివాదం వల్ల జమునను నాలుగేళ్ల పాటు బ్యాన్ చేయడం జరిగింది.జమునకు ఇండస్ట్రీలో వెండితెర సత్యభామగా పేరుంది.
ఏ పాత్రలో నటించినా తన నటనతో అద్భుతంగా మెప్పించడం జమునకే సాధ్యమైంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని అరుదైన నటీమణులలో ఒకరిగా జమున పేరు సంపాదించుకున్నారు.
కొన్ని పాత్రలలో తాను మినహా ఎవరూ నటించలేరనేంత అద్భుతంగా జమున నటించడం గమనార్హం.సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న జమున తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆమె సత్తా చాటారు.
వరుస ఆఫర్లతో జమున బిజీగా ఉన్న తరుణంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ఆమెకు విభేదాలు వచ్చాయి.
ఆ సమయంలో జమునతో తాము నటించబోమని ఎన్టీఆర్, ఏఎన్నార్ తేల్చి చెప్పారు.ఆ సమయంలో జమున కెరీర్ ముగిసినట్టేనని కామెంట్లు వినిపించాయి.జమున ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సారీ చెప్పాలని కొంతమంది సూచనలు చేసినా జమున మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని తప్పు చేయని నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆ సమయంలో జమున సాధారణ హీరోలకు జోడీగా నటించి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.ఆ తర్వాత గుండమ్మ కథ సినిమాలో నటించడం ద్వారా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఆమెతో విభేదాలు తొలగిపోయాయి.జమున భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జమున తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.