హీరో తరుణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో నువ్వేకావాలి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచయితగా పని చేశారు.రామోజీరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.2000 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నిరం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను సోలో ప్రొడ్యూసర్ గా నిర్మించాలని స్రవంతి రవికిషోర్ భావించినా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో రామోజీరావుతో కలిసి నిర్మించారు.
కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమా కోసం తరుణ్ తీసుకున్న పారితోషికం కేవలం 3 లక్షల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమాలో సెకండ్ హీరోగా సాయి కిరణ్ నటించగా రిచా హీరోయిన్ గా నటించారు.
ఒక కోటీ 30 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 24 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.మొదట్లో తక్కువ థియేటర్లలోనే నువ్వే కావాలి విడుదల కాగా హిట్ టాక్ రావడం వల్ల ఈ సినిమాకు రెండో వారం నుంచి థియేటర్లు పెరిగాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి కొన్నిరోజుల ముందు విడుదలైన వంశీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.
బి గోపాల్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా కృష్ణ కీలక పాత్రలో నమ్రత హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన మహేష్, నమ్రత తర్వాత రోజుల్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.నువ్వేకావాలి విడుదలైన తర్వాత వంశీకి థియేటర్లు తగ్గడంతో పాటు కలెక్షన్లు తగ్గడంతో సినిమా ఫ్లాప్ అయింది.