రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ వరుస విజయాలతో దూసుకెళుతోంది.తెలుగులో నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు వచ్చినా కథ, పాత్రచిత్రణ నచ్చితే మాత్రమే కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
గ్లామర్ షోకు దూరంగా ఉండే కీర్తి సురేష్ అభినయానికి ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్ గా తన స్థాయిని పెంచుకుంటోంది.
మహానటి సినిమా కీర్తి సురేష్ కు తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ ఇండియా ఈ నెల 4వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.గత సినిమాల్లో కొంచెం బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమాలో సన్నగా కనిపిస్తోంది.
బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సినీ రంగంలో పరిస్థితులు బాలేవని.
అందువల్లే తన సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.మిస్ ఇండియా ఒక అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీ అని.మధ్యతరగతి యువతి తను కన్న కలలను ఏ విధంగా సాధించుకుందో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.మిస్ ఇండియా సినిమా కోసమే తాను బరువు తగ్గానని కీర్తి వెల్లడించారు.
సినిమా పాత్రకు అనుగుణంగా హీరోయిన్ సన్నగా ఉండటంతో పాటు ఏ డ్రస్ వేసినా బాగుండాలని దర్శకుడు చెప్పారని దీంతో వర్కౌట్లు చేసి బరువు తగ్గానని కీర్తి సురేష్ తెలిపారు.మంచి కాన్సెప్ట్ దొరికితే వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమేనని ప్రకటించారు.
జనవరి నుంచి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నానని కీర్తి సురేష్ చెప్పారు.