ఈ మధ్య కాలంలో కాంతారావు పిల్లల దీనస్థితికి సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్న కాంతారావు ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి కారణమేంటో చాలామందికి అర్థం కాలేదు.
అయితే కాంతారావు పిల్లల దీనస్థితికి కృష్ణ మూవీ కారణం కావడం హాట్ టాపిక్ అవుతోంది.కాంతారావు కూతురు సుశీల మాట్లాడుతూ ఆయన మరణం బాధాకరం అని అన్నారు.
కృష్ణగారు నా ఫేవరెట్ హీరో అని ఆమె కామెంట్లు చేశారు.కృష్ణగారు అన్నా వాణిశ్రీ అన్నా నాకు చాలా ఇష్టమని సుశీల వెల్లడించారు.కృష్ణగారితో మాట్లాడాలంటే భయం ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.కృష్ణగారు భోళా మనిషి అని కపటం లేని వ్యక్తి అని నాన్న చెప్పేవారని సుశీల కామెంట్లు చేశారు.
ఆయనకు ఉన్న స్థాయిలో అభిమాన సంఘాలు ఎవరికీ లేరని ఆమె వెల్లడించారు.కృష్ణ మరణ వార్త తెలిసి ఏడుస్తూనే ఉన్నానని ఆమె అన్నారు.
సెట్స్ లో ఉన్న సమయంలో కూడా ఆయన చాలా సరదాగా ఉండేవారని సుశీల పేర్కొన్నారు.కృష్ణగారు అంటే ఎంత అభిమానమో చెప్పలేనని ఆమె అన్నారు.కృష్ణగారి ప్రతి మూవీలో నాన్నకు ఒక పాత్ర ఇచ్చేవారని సుశీల తెలిపారు.మా అమ్మను భలే ఆట పట్టించేవాళ్లమని బాగా వచ్చిన జవాబులే పదిసార్లు చెప్పేవాళ్లమని సుశీల అన్నారు.
నాన్న సంపాదించిన ఆస్తులను నాన్న అమ్మేశారని ఆమె పేర్కొన్నారు.
నాన్న 5 సినిమాలను నిర్మించారని ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు నష్టాలను మిగిల్చాయని సుశీల అన్నారు.కృష్ణగారితో నాన్నగారు ప్రేమజీవులు అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయిందని సుశీల తెలిపారు.450 ఎకరాల ఆస్తులు పోయాయని కాంతారావు కూతురు సుశీల కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.