కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలై హిట్ కావడం చాలా అరుదుగా జరుగుతోంది.అయితే జాతిరత్నాలు సినిమా మాత్రం ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
ఈ నెల 26వ తేదీన రంగ్ దే, అరణ్య సినిమాలు విడుదలయ్యే వరకు జాతిరత్నాలు సినిమాకు పోటీనిచ్చే మరో సినిమా లేదనే చెప్పాలి.
అయితే జాతిరత్నాలు సినిమా ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ప్రమోషన్స్ కూడా కారణమని చెప్పాలి.
సినిమా రిలీజ్ కు ముందే జనాలకు సినిమా కనెక్ట్ అయ్యే విధంగా జాతిరత్నాలు చిత్రయూనిట్ ప్రమోషన్లు చేసింది.సినిమా రిలీజ్ కు ముందే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
సినిమా రిలీజైన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు టీవీ షోలలో పాల్గొని జాతిరత్నాలు చిత్రయూనిట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
జాతిరత్నాలు సక్సెస్ మీట్ లో సినిమాలోని పాత్రలకు సంబంధించిన డైలాగ్ లను పేలుస్తూ నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.అమెరికాలో జాతిరత్నాలు సినిమా 1 మిలియన్ మార్క్ ను అందుకోగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు.వేర్వేరు కారణాల వల్ల అమెరికాకు వెళ్లలేకపోయిన రాహుల్ రామకృష్ణ పాన్ కార్డ్ తీసుకొని అమెరికాకు వస్తానంటూ వీడియో విడుదల చేసి సినిమాను మరింతలా ప్రమోట్ చేశారు.
ప్రమోషన్ల విషయంలో జాతిరత్నాలు రూటే వేరని చెప్పాలి.ఈ సినిమా హిట్ కావడానికి ప్రమోషన్లే కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.భవిష్యత్తులో పెద్ద సినిమాలు కూడా ప్రమోషన్ల విషయంలో జాతిరత్నాలు సినిమాను ఫాలో అవుతాయేమో చూడాల్సి ఉంది.