టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ 2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ నెల 11వ తేదీన అల వైకుంఠపురములో రీయూనియన్ జరగగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు అల వైకుంఠపురములో లాంటి సక్సెస్ దక్కటానికి 20 సంవత్సరాలు పట్టిందని చెప్పారు.
ఆ తరువాత ఇది తొలి అడుగేనంటూ బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.
సుకుమార్ ఇచ్చిన భరోసా వల్లే బన్నీ అలా చెప్పారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
రంగస్థలం సినిమాతో సుకుమార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కెరీర్ మొదట్లో ఎక్కువగా క్లాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ రంగస్థలం సినిమాతో మాస్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలనని ప్రూవ్ చేశారు.
సుకుమార్ పుష్ప సినిమా కథ రంగస్థలం సినిమా కంటే అద్భుతంగా ఉండేలా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
కోసం చాలా సమయం కేటాయించి బన్నీ ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా పుష్ప కథ విషయంలో సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.బన్నీ రగ్డ్ లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచగా సినిమాలో ట్విస్టులు ఊహించని స్థాయిలో ఉంటాయని సమాచారం.ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు సైతం అభిమానులను గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది.
బన్నీ పుష్ప సినిమాపై, తరువాత సినిమాలపై ఉన్న నమ్మకంతోనే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారని బన్నీ తన తరువాత సినిమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుండటంతో ఈ సినిమా ఇతర ఇండస్ట్రీల్లో సైతం అల్లుఅర్జున్ మార్కెట్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి.