తెలంగాణలో చాప క్రింద నీరులా పాకి ఒక్కసారిగా బలపడ్డ పార్టీ బీజేపీ.బీజేపీ ఇంత బలంగా తయారవుతుందని ఎవరు ఊహించి ఉండరు.
అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి గ్రేటర్ లో 2 స్థానాల నుండి 40 కి పైగా స్థానాలను గెలిచి అధికార టీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చిందనే చెప్పవచ్చు.ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
అయితే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ దుబ్బాక తరహాలోనే నాగార్జున సాగర్ లో గెలవాలని ప్రయత్నిస్తోంది.
అయితే బీజేపీ ఇప్పటికే నాగార్జున సాగర్ అభ్యర్థిని ఖరారు చేసింది.అయితే ఇక్కడే బీజేపీ తొందరపాటు నిర్ణయం తీసుకుంది.
బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చింది.అయితే నాగార్జున సాగర్ ఎస్సీ కమ్యూనిటీ చాలా తక్కువ.
ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో మిగిలిన నేతలు అలక బూనారు.అందుకే బీజేపీ పార్టీ కి ఉమ్మడి జిల్లాలో అసలు క్యాడర్ లేని పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని, ఇది వరకే పోటీ చేసిన….
అభ్యర్థికి అవకాశం ఇస్తే ఓటింగ్ శాతం పెరిగి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.