వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా , ఏది తీసినా అది మాత్రం ఏదో ఒక సంచలనం రేపుతోంది.వర్మ ఏరి కోరి మరీ వివాదాస్పదమైన సున్నితమైన అంశాలను ఎంచుకుని మరీ సినిమాలు తీస్తూ కాంట్రవర్సీ చేస్తుంటాడు.
ఆ విధంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇదే అసలు కథ అంటూ టాగ్ లైన్ కూడా పెట్టేసాడు.ఆ బయోపిక్ మీద ఏపీలో చాలా వివాదమే నడిచి చివరకి ఏపీలో ఆ సినిమా ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు.
ఇక ఇప్పుడు ఏపీలో విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ విజయవాడలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ రచ్చ రచ్చ అయ్యింది.అయితే వర్మ ప్రెస్ మీట్ ను పోలీసులు అడ్డుకోవడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు ఇప్పుడు బయటకి పొక్కింది.
అయితే అందులో నిజానిజాలు ఏంటి అందేది మాత్రం క్లారిటీ లేదు
రాంగోపాల్ వర్మ కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొట్టాడనికి రోడ్డుపై ప్రెస్ మీట్ ను ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేశారా? రాజకీయ కుట్రలో భాగంగా విజయవాడలో అల్లర్లకు ప్లాన్ చేశారా అనే అనుమానంతో ఆంధ్ర పోలీసులు ఉన్నారు.దీనికి తగ్గట్టుగా వారి వద్ద ఇంటలిజెన్స్ సమాచారం ఉండటంతో వర్మను వెనక్కి పంపేసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు తెలంగాణ నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టారు.బాబు సీఎంగా అన్ని పవర్స్ ఉన్నప్పుడే తలసాని వంటి నాయకులు వచ్చి చంద్రబాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
వాళ్లూ వీళ్లే కాదు.విజయవాడలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగాలనుకున్న ఏ ఒక్క సమావేశం వాయిదా పడలేదు.
కానీ వర్మ పెట్టుకున్న ప్రెస్మీట్ ను మాత్రంఅడ్డుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు
వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి పోలీసులు హోటల్స్, క్లబ్ల యాజమాన్యాలను బెదిరించినట్లుగా ప్రచారం చేస్తున్నారు.అసలు నిజంగా వర్మ సైలెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పాల్సింది ఏదో చెప్పుకువెళ్లాలి అంటే విజయవాడలో ప్రెస్క్లబ్ ఉంది.
అక్కడ వారిని ఎవరూ బెదించలేరు.కానీ ఎవరూ పర్మిషన్ ఇవ్వలేదని రోడ్డుమీద పెడతామని చెప్పడానికి కారణం ఏమిటి.? వర్మను పావుగా వాడుకుని కుల గొడవలు రేపే కుట్ర జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు బయలుదేరాయి.విజయవాడ సహజంగానే.
కాస్త సున్నితమైన ప్రాంతం.అక్కడ గొడవలు రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంతా అనుమానిస్తున్నారు.