టాలీవుడ్లో పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఇంకా కొనసాగుతూనే ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.నిన్న కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది.
కరోనా కారణంగా ఇండస్ట్రీకి చెందిన వారిని పిలవలేదు.కేవలం వంద మంది సినీ ప్రముఖుల సమక్షంలో కాజల్ మరియు గౌతమ్ ల పెళ్లి జరిగింది.
పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అన్ని వర్గాల వారిని తన సినిమాలతో ఆకట్టుకున్న ముద్దు గుమ్మ టాలీవుడ్లో దాదాపు అందరు హీరోలతో నటించింది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా సీనియర్ మరియు జూనియర్ స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న సందర్బంగా ఒక్కరు ఇద్దరు మినహా ఎవరు కూడా పెళ్లి శుభాకాంక్షలు చెప్పక పోవడంపై కాజల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాజల్ గౌతమ్లకు కేవలం బెల్లం కొండ సాయి శ్రీనివాస్ మాత్రమే శుభాకాంక్షలు చెప్పాడు.
ఇక మంచు విష్ణు తన సినిమా పోస్టర్ ను విడుదల చేసి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియ జేశాడు.కాని ఇతర సీనియర్ మరియు జూనియర్ హీరోలు ఎవరు కూడా కాజల్ పెళ్లికి శుభాకాంక్షలు చెప్పలేదు.
ఈ విషయంలో కాజల్ అగర్వాల్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఆమె ఎంతో మందితో కలిసి నటించింది.కాని వారికి ఎవరికి ఇప్పుడు ఆమె కనిపించడం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె నటించింది.
అక్కడి వారు కూడా ఈమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పలేదు.దాంతో వారిపై కూడా కాజల్ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు.
మొత్తానికి కాజల్ అభిమానులు స్టార్ హీరోలను టార్గెట్ చేసి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.