అక్కినేని సమంత.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2009 నుంచి ఫామ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా మారింది.అప్పటి నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మారింది.
పెళ్ళి తరవాత సినిమాలు చేస్తుందా లేదా అని ఎంతోమంది సందేహం వ్యక్తం చేసిన సమయంలో పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని చెప్పుకొచ్చింది.
నిజానికి పెళ్లికి ముందు ఉన్న అభిమానం పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కి దక్కదు కానీ సమంత మాత్రం పెళ్లి తర్వాత మరింత మందికి అభిమాన నటిగా మారిపోయింది.
అన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన నటన ఏంటో నిరూపించుకుంది.భర్త నాగ చైతన్య తో మజిలీ సినిమాలో నటించిన సమంత ఆ తర్వాత ఓ బేబీ అంటూ వృద్దురాలి గా ఎంతో అద్భుతంగా నటించింది.
ఇక అలా తన నటనతో ఎంతో మంది ని సొంతం చేసుకున్న సమంత కరోనా వైరస్ లాక్ డౌన్ లో ను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు దగ్గరగా ఉంది.
లాక్డౌన్ సమయంలో టెర్రస్ పై చెట్ల పెంపకం.భర్త కి ఇష్టమైన వంటకాలు నేర్చుకోవడం వంటి వీడియోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల ఎంతో మందికి ఆమె పై అభిమానం పెరిగింది.ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షో లో ఒక ఎపిసోడ్ ని హోస్ట్ చేయడం.
ఆహా లో ప్రసారమైన సామ్ జామ్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కూడా నటించింది.అలా ఎప్పుడు షూటింగ్ లో అప్పుడప్పుడు విహారయాత్రల్లో ఉండే సమంత సద్గురు ను కలవడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆధ్యాత్మిక చింతనతో పాటు దైవికం గురించి సద్గురు చెప్పిన కొన్ని మాటలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది సమంత.కాగా గతంలోనూ టాలీవుడ్ సెలబ్రేటీలు ఎంతోమంది సద్గురును కలిశారు.