సాయి పల్లవి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది “ఫిదా” సినిమానే.ఎందుకంటే నిజంగానే ఆ సినిమాలో తన మాటలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
తను చదువుకునే వయసులోనే సినిమాల్లోకి వచ్చింది.సినిమాలు చేస్తూనే తన వైద్య విద్యను పూర్తి చేసింది.
సాయి పల్లవి తమిళ్ అమ్మాయ్ అయినప్పటికి తెలుగులో ఇప్పటికే 7 సినిమాలలో నటించింది.కేవలం నటించడమే కాదు తెలుగు నేర్చుకొని మరి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.
సినిమాల్లోకి రాకముందు డాన్స్ చేసేది.తెలుగు టీవీ ఛానల్ ఈటీవీలో ప్రసారమైన “ఢీ” ప్రోగ్రాంలో డాన్స్ చేసి మంచి మార్కులు కొట్టేసిన పిల్ల మలయాళం సినిమా అయిన ప్రేమమ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.
అప్పటికి డాక్టర్ చదువు చదువుతున్నప్పటికి ఆ సినిమాలో నటించి మాయం అయినా సాయి పల్లవి ఆతర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే ఆమె సినిమాల్లో నటిస్తుంది.
సాయి పల్లవి సినిమాల్లో మేకప్ లేకుండానే నటిస్తుంది.ఇక ఆమెను ఎక్కడ ప్రైవేట్ పార్టీలో చూసిన జపమాల ధరించి ఉంటుంది.
దాని వెనుక పెద్ద కథ ఉంది.ఏంటి అంటే.
ఆమె తాతయ్య గారు జపమాల ధరించమని చెప్పారని అందుకే ఆమె 8 సంవత్సరాల నుంచి జపమాలను ధరిస్తుంది.అసలు జపం అంటే ప్రార్ధించడం.
ఏదైనా దిగ్భ్రాంతికి గురైనప్పుడు, నిరాశ కలిగినప్పుడు ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం, మనసు నిశ్చలం కోసం జపమాలను ధరించి ప్రార్థిస్తుంది.అలాగే తనతో నటించిన హీరో శర్వానంద్ కూడా జపమాలను ధరించేలా అలవాటు చేసింది సాయి పల్లవి.
ఈ విషయాన్నీ శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి “లవ్ స్టోరీ” సినిమాలో నటిస్తోంది.