తెలంగాణా ఎన్నికల తరవాత అత్యంత బిగ్ ఫైట్ జరగనుంది ఏపీలో అనేది అందరికి తెలిసిందే.అయితే ఏపీ ఎన్నికల విషయంలో ముందు వరుసలో నిలుస్తున్న పార్టీలు వైసీపీ ,తెలుగుదేశం ,జనసేన పార్టీలే.
ఎప్పుడు రాష్ట్రంలో రాజకీయ వార్తలు వచ్చినా సరే కేవలం ఈ మూడు పార్టీల ఊసే వినిపిస్తోంది తప్ప మరో పార్టీ పేరు వినపడదు.అయితే అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సారిగా బీజేపీనేత ఆ పార్టీ శాసనసభ సభ్యుడు మాజీ మంత్రి అయిన మాణిక్యాల రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వార్తల్లో వ్యక్తీ అయ్యారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి పంపించారు.జిల్లా అభివృద్దిలో చంద్రబాబు శ్రద్ద చూపడంలేదంటూ జిల్లాపై అమితమైన ప్రేమని చూపించిన మాణిక్యం.బాబుపై ఆరోపణలు చేస్తూ తన ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటూ లేనిపక్షంలో తన రాజీనామాను స్పీకర్కి అందించాలని అన్నారు మాణిక్యాలరావు…అయితే ఈ రాజీనామా వెనుకాల పెద్ద వ్యూహమే ఉందని.
మాణిక్యం వెనుకాల ఉంది వ్యుహరచనలు చేస్తోంది బీజేపీ అధిష్టానమేనని.ఎందుకంటే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ గురించి ప్రజలు చర్చించుకోక పోవడంతో బీజేపీ పెద్దల వ్యూహం ప్రకారమే మాణిక్యాలరావు రాజీనామా ఎపీసోడ్ ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.ఇదిలుంటే మాణిక్యాలరావు రాజీనామా తంతు చూసుంటే అచ్చు గుద్దినట్టు, వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారాన్ని గుర్తు చేస్తోందని అంటున్నారు.అప్పట్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం తమ పదవులకు రాజీనామా చేస్తే, ఆ రాజీనామాలు , ఉప ఎన్నికలకు వీలులేని టైం లో స్పీకర్ ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఏపీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతోనే మాణిక్యాలరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని.ఆమరణ దీక్ష కి కూర్చుంటానని ప్రకటించడం కూడా ఏపీలో బీజేపీ ఉనికి కోసమేనని అంటున్నారు.అయితే వైసీపీ చేస్తున్న దొంగ నాటకాలని బీజేపీ కాపీ పేస్ట్ చేస్తోందని.బీజేపీ వైసీపీ ఒక్కటేనని చెప్పడానికి ఇంతకు మించి నిదర్సనం ఏమి కావాలని అంటున్నారు టీడీపీ నేతలు.
మరి మాణిక్యాలరావు పలుకులు ప్రకటన వరకేనా వస్తవ రూపం దాల్చుతాయా అనేది వేచి చూడాలి.