రెండు రోజుల క్రితం నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది.కరోనా పరిస్థితుల కారణంగా బంధువులని పెద్దగా ఆహ్వానించలేదు.
కేవలం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్ధ వేడుకకి హాజరయ్యారు.ఈ వేడుకకి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.
ఈ నిశ్చితార్ధం వేడుకకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.దీంతో సోషల్ మీడియాలో అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే కొంత మంది ఇదేదో ప్రదాన అంశం అన్నట్లు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
మెగా ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ కి సన్నిహిత సంబంధాలు లేవనే విషయం మరోసారి బయట పడింది అంటూ అనవసర ప్రచారం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ ఈ నిశ్చితార్ధ వేడుకకి హాజరుకాకపోవడానికి గల కారణాలు బయటకి వచ్చాయి.
పవన్ గత కొంత కాలం నుంచి చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు.గత నెల ఈ దీక్షకు పూనుకున్నారు.నాలుగు నెలలపాటు కొనసాగే ఈ దీక్ష సమయంలో సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు విడిచి వెళ్లకూడదు.ఎంగేజ్మెంట్ రాత్రి పూటే జరగడంతో ఆ వేడుకకి పవన్ హాజరుకాలేకపోయారు.
నిశ్చితార్ధం అయిన తరువాతి రోజు ఉదయమే నాగబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లి నిహారికను, ఆమెకు కాబోయే భర్త చైతన్యను ఆశీర్వదించారు.అయితే పవన్ కళ్యాణ్ నెగిటివ్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండేవారు కాస్తా ముందుగానే అత్యుత్సాహం చూపించి చిలువలు పలువలుగా కథనాలు వండి వార్చేశారు.