ఏపీలో జరుగుతోన్న కార్పొరేషన్ , మునిసిపల్ ఎన్నికలు అధికార పార్టీ వాళ్లను టెన్షన్ పెట్టేస్తున్నాయి.రిజల్ట్ ఏదైనా తేడా వస్తే సీఎం జగన్ ఆగ్రహానికి గురి కాక తప్పదు.
ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికి ఊస్టింగ్ లు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే జగన్ ఇచ్చేశారు.ఇక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటే.
వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు కట్ అని కూడా చెప్పేశారన్న ప్రచారం అయితే జరుగుతోంది.ఇవన్నీ ఇలా ఉంటే కార్పొరేషన్లలో అన్ని కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని జగన్ ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి చెప్పేశారట.
ఒంగోలు, ఏలూరు, నెల్లూరు లాంటి కార్పొరేషన్లకు మంత్రులు ప్రాధినిత్యం వహిస్తున్నారు.
దీంతో సహజంగానే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఎమ్మెల్యే గా ఉన్న మంత్రి ఆళ్ల నాని.అటు వైద్య శాఖా మంత్రిగా ఉండడమే కాకుండా.
ఇటు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే ఏలూరు కార్పొరేషన్కు జరుగుతోన్న ఎన్నిక నానికి అగ్ని పరీక్షగా మారింది.
గత సాధాణ ఎన్నికల్లోనే నాని చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం 3 వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు.
ఇక ఇప్పుడు టీడీపీకి అక్కడ సానుభూతి ఉంది.
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందడంతో ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణకు పగ్గాలు ఇచ్చారు.ఈ సానుభూతి టీడీపీకి ప్లస్ కాగా… వైసీపీలో ఉన్న గ్రూపుల గోల కూడా నానికి మైనస్ గా మారనుంది.
మరో వైపు ఎనిమిది నెలల్లో కేబినెట్ ప్రక్షాళన కూడా జరగనుంది.ఇక్కడ రిజల్ట్ ఏదైనా తేడా వస్తే నాని మంత్రి పదవి ఊస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో సరైన రిజల్ట్ ఇవ్వని వారి పదవులు ఊస్ట్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు.దీంతో నానిలో టెన్షన్ మొదలైందనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది.