ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇంత క్లిష్ట సమయంలో ప్రజలు దేవుడిలా చూస్తున్న ఒకే ఒక వ్యక్తి సోనూసూద్.అసలు దైవం మనుష్య రూపేనా అన్న చందంగా దేవుడే సోనూసూద్ రూపంలో వచ్చాడని సోనూసూద్ సాయం పొందిన వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.ఒక్కటని కాదు.ఎన్నెన్ని సేవలు… ఇక ఈయన సేవలకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతూ ప్రధాన మంత్రివి కావాలి అని పట్టుబట్టారంటే సోనూసేవలు ఏ రేంజ్ కు వెళ్ళాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఇంటికే తన సేవలు అందిస్తూ ప్రభుత్వాలకే సవాల్ విసురుతున్న పరిస్థితి ఉంది.సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు సైతం సోనూ సేవలు అందుతున్నాయి.
ఇటీవల క్రికెటర్ సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ట్వీట్స్ కు రిప్లై ఇచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాడు సోనూసూద్.అయితే ఇవన్నీ ఒకెత్తయితే తాజాగా సోనూసూద్ కు వచ్చిన రిక్వెస్ట్ ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసిందని చెప్పవచ్చు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూ సూద్ కు పరిచయం ఉన్న వ్యక్తి.ఆ పరిచయంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు ఆక్సిజన్ జనరేటర్ లేక ఇబ్బంది పడుతున్నారని, సాయం చేయాలని సోనూసూద్ ను కోరాడు.దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్ 1.5 కోట్లతో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించాడు.ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది.