బుల్లితెరపై ఎంతో విజయవంతమైన కార్యక్రమాలలో అమితాబచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం 12 సీజన్లను పూర్తిచేసుకొని 13వ సీజన్ ను ప్రసారం చేస్తోంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరవుతూ తమదైన శైలిలో ఆట ఆడుతుంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి రియల్ హీరో సోనుసూద్ వచ్చినట్టు తెలుస్తోంది.
కరోనా సమయంలో ఎంతో మందికి తనదైన శైలిలో సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న సోను సూద్ అమితాబ్ కార్యక్రమానికి వచ్చినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనుసూద్ అమితాబచ్చన్ తో కలిసి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ముచ్చటించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా సోనూసూద్ ఎంత గెలుచుకున్నారు అనే విషయాల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.ఇకపోతే సోనుసూద్ సినిమాల విషయానికొస్తే పలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
ఇక తెలుగులో సోనూసూద్ విలన్ గా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఆచార్య సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు.