కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి, అనేక మందిని ఆదుకున్న వ్యక్తి సోను సూద్.సినిమాలలో విలన్ క్యారెక్టర్లు వేస్తున్న నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి ఆయన.
అసలు విషయంలోకి వెళ్తే… తాజాగా సోను హైదరాబాదులో అడుగుపెట్టాడు.హైదరాబాద్ లో ఫ్లైట్ దిగిన ఆయన మాస్కు ధరించినా కూడా కొందరు ఆయనను గుర్తు పట్టి ఆయనతో సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
అయినా సరే, సోనుసూద్ వారిని నిరాశ పరచకుండా వారితో కలిసి సెల్ఫీ దిగారు.దీంతో వారికి ఆనందం అవధులు లేకుండా పోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది ఉపాధి కూలీలు వారి సొంత గ్రామాలకు చేరుకోలేక, ఉన్నచోట పని చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో అనేక మంది ఉపాధి కూలీలకు వారి సొంత ఊరికి వెళ్లేందుకు బస్సు, ట్రైన్, విమానాలు ఇలా ప్రతి దాంట్లో వారిని సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎంతగానో సహాయం చేసి వారికి దేవుడిలా మారాడు.తన సొంత ఖర్చులతో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన కొందరిని స్వదేశానికి కూడా తీసుకరాగలిగాడు.
అంతేకాకుండా ఇబ్బందుల్లో ఉన్న చాలామందికి సోనూసూద్ స్వయంగా సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ప్రస్తుతం దేశంలో సోనూసూద్ అంటే ఓ మంచి వ్యక్తిలా పేరు తెచ్చుకున్నాడు.మరికొందరికి ఆరాధ్య దైవం అయిపోయాడు సోను సూద్.ఇక ప్రస్తుతం సోను హైదరాబాద్ రావడానికి గల కారణం ఆయన టాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.అందులో ఒకటి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఆయన నటిస్తున్నారు.ఈ షూటింగ్స్ సంబంధించి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం.