తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం గుప్పిస్తూ చాలా వరకు ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచే దిశగా చాలా బలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
బీజేపీ పార్టీ మొత్తం కేసీఆర్ టార్గెట్ గా ముందుకు సాగుతున్నా ఈటెల రాజేందర్ మాత్రం కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.ఇప్పటికీ బీజేపీ కి అంతగా బలం లేని నియోజకవర్గాలలో వరుస పర్యటనలు చేస్తూ బీజేపీ బలోపేతం దిశగా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
తాజాగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ పతనమే నా లక్ష్యమని పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీకి సిద్దమని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు.ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రకరకాల కోణాల్లో చర్చ జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో నలు దిక్కులా టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టి బీజేపీ ని అధికారంలోకి తీసుకొచ్చి టీఆర్ఎస్ ను గద్దె దింపుతామని ఏ ఒక్క బీజేపీ నేతలను కదిలించినా చెబుతున్న మాట.ప్రస్తుతం అయితే బీజేపీ రాజకీయ విధానంపై టీఆర్ఎస్ ఎటువంటి కామెంట్స్ చేయకున్నా కదలికల్ని మాత్రం గమనిస్తుందన్న మాట వాస్తవం.కేసీఆర్ కూడా చాలా క్లారిటీగా వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ముందుగానే గ్రహిస్తూ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈటెల తన పంతం నెగ్గించుకుంటాడా లేడా అన్నది చూడాల్సి ఉంది.