తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోలు కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు యాంకర్లుగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఓటీటీలు కూడా అందుబాటులోకి రావడంతో ఓటీటీల ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా వెండితెర నటులు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరి వెండి తెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి ఏ హీరోలు బుల్లితెరపై సందడి చేస్తున్నారు అనే విషయానికి వస్తే…
నాగార్జున:
వెండితెరపై హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున( Nagarjuna ) బుల్లితెరపై కూడా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈయన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా నాగార్జున యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఎన్టీఆర్:
పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్( Ntr ) కూడా బుల్లితెరపై తన మాట తీరుతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.ఈయన బిగ్ బాస్ కార్యక్రమంతో పాటు ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లి తెర ప్రేక్షకులను సందడి చేశారు.
నాని:
నాని( Nani ) కూడా బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే ఇక నాని కూడా ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి ఆదరణ పొందారు.
చిరంజీవి:
ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి చిరంజీవి( Chiranjeevi ) మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో ఒక సీజన్ కి ఈయన కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
రానా:
నటుడిగా గుర్తింపు పొందినటువంటి రానా (Rana) కూడా నెంబర్ వన్ యారీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంచి ఆదరణ పొందారు.ఈయన కూడా వ్యాఖ్యాతగా మంచి సక్సెస్ అందుకున్నారు అని చెప్పాలి.
మనోజ్:
మంచు వారసుడిగా గుర్తింపు పొందినటువంటి మంచు మనోజ్ (Manoj) ఇటీవలే ఉస్తాద్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఈయన మొదటిసారి వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారని చెప్పాలి.
విశ్వక్ సేన్:
ఆహాలో ఫ్యామిలీ ధమాకా షోతో యాంకర్గా ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్(Vishwak Sen)ఓ వైపు సినిమాలు, మరోవైపు గేమ్ షో చేస్తూ రెండువైపులా బిజీ అయ్యారు.
బాలకృష్ణ:
ఇన్ని రోజులపాటు కేవలం నటుడిగా వెండితెరపై సందడి చేసినటువంటి బాలకృష్ణ (Balakrishna )ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.బాలయ్య తన మాట తీరుత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లినటువంటి బాలకృష్ణ మాట తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పాలి.