ఈ మధ్య నటులు సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది హీరో, హీరోయిన్స్ రీ ఎంట్రీతో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో బ్యూటీ కలర్స్ స్వాతి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన స్వాతి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
వెండి తెరపై కాకుండా బుల్లితెరపై లో కూడా చేసింది స్వాతి.మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే ప్రోగ్రామ్ లో వ్యాఖ్యాతగా కెరీర్ మొదలుపెట్టిన స్వాతికి.కలర్స్ స్వాతి అని గుర్తింపు వచ్చింది.నటి, వ్యాఖ్యాతగానే కాకుండా సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.
తెలుగు, మలయాళం, తమిళం సినిమాలలో నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈమె నటించిన అష్టాచమ్మా సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పింది.2017 లో లండన్ బాబులు సినిమాలో చివరి సారిగా నటించింది.అదే సమయంలో తను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీ వైపు చూడను కూడా లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టిన్నట్లు తెలుస్తుంది.పంచతంత్రం అనే సినిమాలో నటిస్తున్నట్లు పైగా షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలిసింది.అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా లీక్ అవడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ ఫోటోలో మరింత అందంగా కనిపిస్తున్న కలర్స్ స్వాతి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
తన పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన కలర్స్ స్వాతి తన వ్యక్తిగత విషయాల పట్ల కొన్ని వివాదాలు రావడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.కానీ అవన్నీ పుకార్లని బయటపడగా మొత్తానికి మళ్ళీ తన అమాయకత్వ అందంతో, నటనతో సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి ఎటువంటి సమాచారం లేకపోగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.