రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన చిత్రీకరణ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది.బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా జక్కన్న రాజమౌళిలు పాల్గొన్నారు.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ప్రముఖ స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
నేడు ఉదయం ఈ చిత్రంకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.సినిమా చిత్రీకరణ మొదలు కాబోతుంది అంటూ చెప్పేందుకు గాను అందరు బ్లాక్ కోర్టులు వేసుకుని నల్ల కల్లద్దాలు పెట్టుకుని ఉన్న పొటోను విడుదల చేయడం జరిగింది.
మేము వస్తున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ ఫొటోను తెగ వైరల్ చేశారు.సరే షూటింగ్ ప్రారంభం కోసం అంటూ ఆ పోస్టర్ గురించి అంతా అనుకున్నారు.
అయితే క్లాప్ కొట్టిన సమయంలో మొదటి షాట్ లో కూడా రామ్ చరణ్ మరియు హీరోయిన్ కియారా అద్వానీ కూడా అదే తరహా డ్రస్ వేసుకుని ఉన్నారు.
మొదటి షాట్ లో కూడా హీరో హీరోయిన్స్ అలాంటి డ్రస్ ను ధరించడం వల్ల ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత సూట్ కు ఉందని అంతా అంటున్నారు.సూట్ లో రామ్ చరణ్ ను సినిమా మొత్తం చూడాలంటే కాస్త ఇబ్బంది కలిగించే విషయమమే.అయినా కూడా శంకర్ తప్పకుండా ఈ సినిమాలో ఆయన్ను బాగా చూపిస్తాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.కొందరు మాత్రం ఈ సూట్స్ ఏంటీ శంకర్ భయ్యా అంటూ సోషల్ మీడియాలో శంకర్ ను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.
శంకర్ నుండి ఆ ప్రశ్నకు ఏమైనా సమాధానం వస్తుందో చూడాలి.వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను ముగించేలా ప్లాన్ చేస్తున్నారు.విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.