కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంటాయి.
బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీపడని శంకర్ సినిమాలను అదేస్థాయిలో తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుంటారు.ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేయడం మనకు తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.ఈ పోస్టర్ కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శంకర్ ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు అని దాని కోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఒక ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందని ఇది సినిమాకి ఎంతో హైలెట్ గా ఉండబోతోందని శంకర్ తెలియజేశారు.
ఏడు నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం కోసం డైరెక్టర్ సుమారు 70 కోట్ల వరకు ఖర్చు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ రేంజ్ లో తెరకెక్కిన ఈ సన్నివేశం గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉండబోతోందని చిత్ర బృందం వెల్లడించారు.
మొత్తానికి శంకర్ హీరో రామ్ చరణ్ కు భారీ బ్లాక్ బస్టర్ అందించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.