మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఒక వైపు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఇక మరొక వైపు అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా ప్రకటించడమే కాకుండా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు.శంకర్ ఎప్పుడు లేనంత స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు.
‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణే లో స్టార్ట్ చేసి ఈ నెల 10న పూర్తి చేసినట్టు సమాచారం.ఈ ఫస్ట్ షెడ్యూల్ లో కీలక మైన సన్నివేశాలతో పాటు భారీ సెట్ లో ఒక పాటను కూడా తెరకెక్కించారు.ఇక రెండవ షెడ్యూల్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక ఈ రోజు నుండి రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.
ఈ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో తెరకెక్కించ బోతున్నట్టు సమాచారం.
ఈ షెడ్యూల్ లో మరొక సాంగ్ తో పాటు ఇతర కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించ నున్నారట.ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ కు జోడీగా రెండవసారి నటిస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళ నటుడు సురేష్ గోపి ను తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లోనే నటిస్తున్నట్టు టాక్.వీరితో పాటు హీరో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారు.
ఇక ఈ సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో.