రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో సినిమా వస్తుంది.దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
బుధవారం ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఓపెనింగ్ డేనే ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.హీరో, హీరోయిన్ తో పాటుగా సినిమాలో నటిస్తున్న సునీల్, శ్రీకాంత్, అంజలిల సూట్ వేసుకుని.
నిర్మాత దిల్ రాజు, శంకర్ లు కూడా అదే విధంగా రెడీ అయ్యి వుయార్ కమింగ్ అనే పోస్టర్ వదిలారు.అయితే ఈ పోస్టర్ డిజైన్ కోసం కూడా శంకర్ భారీగా ఖర్చు చేయించాడని టాక్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్సీ 15 ఓపెనింగ్ డే పోస్టర్ కోసం దాదాలు కోటి 75 లక్షల దాకా ఖర్చు పెట్టించాడని అంటున్నారు.శంకర్ సినిమా అంటేనే ఓ రేంజ్ లో బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది.
సో దిల్ రాజు అందుకు సిద్ధమయ్యే ఈ సినిమా కోసం రంగంలోకి దిగాడు.పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని టాక్.
ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్న చరణ్ శంకర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిక్స్ అవ్వొచ్చు.