అతిపెద్ద గృహ రుణాల సంస్థ డీ హెచ్ ఎఫ్ ఎల్ బోర్డు తిప్పేసింది.ప్రయివేట్ రంగానికి చెందిన గృహ రుణాల దిగ్గజం దివాన్ హోసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తానికి దివాళా తీసినట్లు తెలుస్తుంది.
దేశంలోనే మూడో అతిపెద్ద గృహ రుణాల సంస్థ ఆయిన డీ హెచ్ ఎఫ్ ఎల్ గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.ఈ నేపథ్యంలో పలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను కూడా ఆ సంస్థ చెల్లించలేకేపోవడం తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దివాళా కోర్టుకు సిఫార్సు చేసింది.
ఈ సంస్థ పాలనాపరమైన అంశాలు,నగదు సంక్షోభం అంశాలు ఆ సంస్థను దివాళా దిశగా పయనించేలా చేశాయి.గత జూలై నాటికి డీహెచ్ఎఫ్ఎల్ రుణభారం రూ.83,873 కోట్లుగా ఉంది.ఇందులో సెక్యూర్డ్ రుణం రూ.74,054 కోట్లు కాగా… అన్-సెక్యూర్డ్ రుణం రూ.9,818 కోట్లు.చాలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా ఈ బ్యాంకు తిరిగి చెల్లించలేక పోవడం తో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మొండి బకాయిలుగా భావించి నిరర్థక ఆస్తిగా ప్రకటించాయి.
ఇటీవలే డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లను దేశం విడిచి వెళ్లొద్దని బొంబాయి హైకోర్టు కూడా ఆదేశించింది.తమకు రావల్సిన రూ.200 కోట్ల కోసం 63 మూన్స్ టెక్నాలజీస్ కోర్టును ఆశ్రయించడం తో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దేశం విడిచి వెళ్లొదని డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్ల ను ముంబాయ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇప్పుడు తాజాగా ఆ సంస్థ దివాళా తీసినట్లు కోర్టు ప్రకటించింది.