రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది.దీంతో ఆర్బీఐ రేపో రేటు 6.25 శాతానికి పెరిగింది.అయితే దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీసుకున్న వివిధ రుణాలపై పడనుంది.వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఏడాది క్రితం నుండి అక్టోబర్ లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి తగ్గిన తర్వాత చిన్న రేట్ల పెంపు కోసం ధరల ఒత్తిడి మందగించడాన్ని ఆర్బీఐ ఉదహరించింది.ఆర్బీఐ గతంలో మూడు సార్లు 50 బీపీఎస్ పెంచింది.
రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే రుణ గ్రహీతల ఈఎంఐ సైతం పెరగనుంది.
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేసేందుకు ఆర్బీఐ రెపో రేటును పెంచింది.ఏప్రిల్ లో వరుసగా పది సార్లు రెపో రేటును యథాతధంగా ఉంచింది.
అయితే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటను తక్షణమే 40 బేసిస్ పాయింట్లు పెంచింది.