ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వాతావరణం సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయాలు చేస్తుంటే మరోపక్క ప్రభుత్వం అదే విధంగా ఎన్నికల సంఘం కూడా ఎక్కడా తగ్గడం లేదు.
ఇటువంటి తరుణంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ నేత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సర్పంచ్ అభ్యర్థిగా ఆ ప్రాంతానికి చెందిన గ్రామ వాలంటీర్ ని నిలబెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఉత్తమ సేవలు అందిస్తున్న సత్యవతి అనే గ్రామ వాలంటీర్ ని రాప్తాడు నియోజకవర్గం లో గ్రామ ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ తో మాట్లాడి సర్పంచిగా నిలబెట్టడం జరిగింది.
డిగ్రీ చదువుతున్న సత్యవతి గత కొంత కాలం నుండి గ్రామంలో గ్రామ వాలంటీర్ గా పని చేస్తూ ప్రజల మన్ననలు అందుకోవడం జరిగింది.అంతేకాకుండా ఉత్తమ మండల గ్రామ వాలంటీర్ అవార్డు కూడా పొందు కోవడం జరిగింది.
ఇలాంటి తరుణంలో సత్యవతి సర్పంచ్ ఎన్నికలలో నిలబడటంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది.
.