బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నట్లు పరిస్థితి మారింది.గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే అతి తక్కువ ధరకే చీప్ లిక్కర్ అందిస్తామని.
హామీ ఇచ్చి సోము వీర్రాజు గా ప్రత్యర్థుల చేత విమర్శలు చేయించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మద్యం తాగే వాళ్ళు ఉన్నారని.
వారికి బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు తగ్గి స్తామని హామీ ఇచ్చి నెగిటివ్ ఇమేజ్ పార్టీపై తేవటం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఇటీవల సీఎం జగన్ జిల్లాకి ఒక విమానాశ్రయం.
తీసుకొస్తామని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.
ఇక జిల్లాకు విమానాశ్రయం అంటూ జగన్ కామెంట్స్ పై వ్యంగ్యంగా విమర్శించారు.కడప జిల్లాలో అది కూడా మనుషుల ప్రాణాలు తీసి .ఉండే మనుషుల చోట కూడా విమానాశ్రయం తీసుకొస్తామని.రాష్ట్ర ప్రభుత్వం మారటం దారుణమని సోము వీర్రాజు కామెంట్లు చేయడంతో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.
ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కడప జిల్లా నేతలు సోము వీర్రాజు చేసిన కామెంట్లను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే తాను వేరే ఉద్దేశంతో అన లేదని వివేకానంద రెడ్డి హత్య దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందని.
సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.