మాస్ మహారాజ్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో రవితేజ.మాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా రవితేజ మారిపోయాడు.
అతనితో సినిమా అంటే అటు మాస్ అంశాలతో పాటు పుష్కలంగా కామెడీ కూడా ప్రేక్షకులు ఆశిస్తారు.రెండింటికి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్న రవితేజ ప్రస్తుతం వరుసగా నాలుగురు దర్శకులని లైన్ లో పెట్టాడు.
ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయ్యాడు.ఈ సినిమాని ఒటీటీలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
దీని తర్వాత రమేష్ వర్మ, వక్కంతం వంశీ, త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు.ఈ ముగ్గురు దర్శకులలో ఎవరి కథని ముందుగా స్టార్ట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తుంది.చిరంజీవి చంటబ్బాయ్ స్ఫూర్తిగా రవితేజ కోసం ఈ కథని సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో డిటెక్టివ్ గా రవితేజ మొదటి సారి కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు.ఇక డిటెక్టివ్ గా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ కేసులు ఇన్వెస్టిగేట్ చేసే విధంగా ఈ సినిమాలో హీరో పాత్ర ఉంటుందని సమాచారం.
ఫుల్ లెంత్ కామెడీతో మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని, కాస్తా థ్రిల్లర్ జోనర్ మిక్స్ చేసి ఉంటుందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.ఇలాంటి డిటెక్టివ్ కథలని కరెక్ట్ గా డీల్ చేస్తే హిట్ గ్యారెంటీ అనే విషయం తెలిసిందే.
మరి ఈ సినిమాతో రవితేజ కూడా అలాగే సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడెమో వేచి చూడాలి.