మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రవితేజ, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘ఖిలాడి’ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.
దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో రవితేజ డ్యుయెల్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్గా అందాల భామ రాశిఖన్నాను సెలెక్ట్ చేశారట చిత్ర యూనిట్.
ఇప్పటికే ఆమెను ఓకే చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే రెండో హీరోయిన్ను సెలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఖిలాడి చిత్ర షూటింగ్ ముగిశాక నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో సినిమాను స్టార్ట్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.
ఇక ఖిలాడి చిత్రంలో రవితేజ పర్ఫార్మెన్స్ అల్ట్రా స్టైలిష్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.ఇక రాశిఖన్నాతో మరోసారి రొమాన్స్ చేసేందుకు రవితేజ రెడీ అవుతుండటంతో, వారి మధ్య కెమిస్ట్రీ ఈసారి ఎలా ఉండబోతుందా అని మాస్ రాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.