మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ కాంబో ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు చిత్రంపై అంచనాలు పెంచేశాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత రవితేజ ఓ సరికొత్త అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్లో అందరు హీరోలు నిర్మాతలుగా మారి సొంత ప్రొడక్షన్ కంపెనీలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో వారు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ నిర్మాతగా కూడా సంపాదిస్తున్నారు.అయితే రవితేజ కూడా తన సొంత బ్యానర్ను ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు.ఈ బ్యానర్లో సరికొత్త ట్యాలెంట్కు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నాడు.
ఇలా వరుసగా స్టార్ హీరోలు తమ సొంత బ్యానర్లు ఏర్పాటు చేస్తుండటంతో రవితేజ కూడా ఇదే దారిలో వెళ్లి సక్సెస్ను అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక రవితేజ క్రాక్ చిత్రం తరువాత తన నెక్ట్స్ చిత్రంగా ఓ మలయాళ సినిమా రీమేక్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో మరో హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
మరి రవితేజ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఎప్పుడు పెడతాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.