మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ డిస్కో రాజా ఎలాంటి డిజాస్టర్గా మిగిలిందో అందరికీ తెలిసిందే.సినిమా కథ ప్రయోగాత్మకంగా ఉన్నా, దాన్ని మలిచిన తీరు బాగా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.
ఇక ఈ సినిమాలో కొంత భాగం 1980కు చెందిన డాన్ బ్యాక్డ్రాప్తో సాగుతోంది.అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా రవితేజ కోరాడట.
కానీ దర్శకుడు ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇక దీంతో రవితేజ తన నెక్ట్స్ మూవీని నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా కథ కూడా ‘డిస్కోరాజా’ కథకు చాలా దగ్గరగా ఉంటుందట.దీంతో ఈ సినిమాలోనూ కొన్ని మార్పులు చేయాల్సిందిగా రవితేజ చెప్పడంతో త్రినాథరావు ఓకే అన్నాడట.
అయితే త్రినాథరావుతో పని చేసిన సక్సెస్ఫుల్ రైటర్ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు పనిచేయకపోవడం ఈ సినిమాపై కొంత అనుమానాలు రేకెత్తిస్తుంది.కాగా మరోసారి డిస్కోరాజా చిత్రం బ్యాక్డ్రాప్తో వస్తున్నాడంటే అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.
మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.