టాలీవుడ్ నటుడు మాస్ మహారాజ్ రవితేజ కు గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందించగా.ఈసారి మూడో సినిమా గా క్రాక్ కూడా మంచి విజయాన్ని అందించింది.
ఈ సినిమా విజయం గురించి మాస్ మహారాజ్ ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో రిజల్ట్ రాగా ఈ సినిమా వల్ల మరింత క్రేజ్ ను పెంచుకున్నారు రవితేజ.మొత్తానికి ‘క్రాక్’ క్రాక్ గా మారిందని తెలుస్తుంది.
మాస్ మహారాజా రవితేజ కు కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన సినిమాలలో సక్సెస్ లేకపోవడంతో ఈ సినిమా వల్ల మంచి హిట్ ను సాధించినందుకు రవితేజ కెరీర్ మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది.ఈ సినిమా విడుదలైన రోజు నుండే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అంతేకాకుండా కరోనా సమయం కాబట్టి సినిమా హాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ తో ఉన్నందున.ఊహించనంత వసూలు వచ్చాయని తెలిపారు.మామూలు స్థాయిలో థియేటర్లు నడిస్తే ఇంకెంత వసూలు వస్తాయో ఊహించలేము.
నటి శృతిహాసన్ హీరో రవితేజ సరసన ఇదివరకే నటించగా.ఈ సినిమాలో మళ్లీ రవితేజ సరసన హీరోయిన్ గా నటించి తన అందంతో అందరిని మెప్పించింది.ఈ సినిమాలో పాటలు తమన్ అందించగా మంచి విజయాన్ని సాధించాయి.
ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించడంతో లుక్ మరింత అదిరిపోయిందంటూ నెటిజనులు తెలుపుతున్నారు.కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న నేరాల గురించి దృష్టిలో పెట్టుకొని చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో నడుస్తున్న తరుణంలో చివరి వరకు మరింత లాభాన్ని అందించనున్నట్లు తెలుపుతున్నారు.ఈ సినిమాతో మాస్ మహారాజ్ రవితేజ కు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయన్న వార్తలు వినిపించగా.
వాటి గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలవనున్నాయి.