మాస్ మహారాజ్ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ కంప్లీట్ చేశాడు.ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇందులో అతనికి జోడీగా తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి నటించారు.
ఇదిలా ఉంటే రవితేజ నెక్స్ట్ మూవీ సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన శరత్ మండవతో చేస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.
ఇదిలా ఉంటే లాక్డౌన్ సడలింపుల తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ఈ మూవీలో కూడా రవితేజకి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ని దర్శకుడు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ అవసరం పడటంతో వారిని ఎంపిక చేశారు.మెయిన్ హీరోయిన్స్ గా మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ని ఇప్పటికే ఫైనల్ చేశారు.
ఇక సెకండ్ హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ రాజీషా విజయన్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.ఈ అమ్మడు మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండగా రీసెంట్ గా ధనుష్ కర్ణన్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు రవితేజ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.మలయాళీ భామలు అంటూ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ అనే పేరు ఉంటుంది.ఆ జాబితాలో నుంచే ఈ బ్యూటీ కూడా ఇప్పుడు తెలుగు ఎంట్రీ ఇస్తుందంటే కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే ఈమె కనిపించనుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.
దీని తర్వాత త్రినాధ్ రావు నక్కిన మూవీని రవితేజ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.