మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఖిలాడీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ దొంగ పాత్రలో దర్శనం ఇస్తున్నాడు.
క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.దీంతో రవితేజ నెక్స్ట్ సినిమాని కూడా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు.
త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపించింది.
అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని తాజాగా ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
కామన్ నుంది పెద్ద బిజినెస్ మెన్ గా ఓ వ్యక్తి ఎలా ఎదిగాడు అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.తప్పుడు దారిలో వెళ్ళకుండా వ్యాపారం ఎలా చేయొచ్చు అనే విషయాన్ని ఈ కథనంలో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.అలాగే కొత్త భామల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఎవరిని ఫైనల్ చేశారనేది చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.మరో రెండు నెలల్లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని బోగట్టా.