మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్ను రిలీజ్కు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇక తన నెక్ట్స్ మూవీలను చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.
అయితే సరైన హిట్ మాత్రం మనోడికి పడట్లేదు.ఇక ఇప్పుడు టాలీవుడ్లో ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంకీలతో కలిసి గతంలో గోపాల గోపాల వంటి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు డాలీ, ఆ తరువాత కాటమరాయుడు చిత్రాన్ని కూడా తీశాడు.ఇక ఈ సినిమా ఆ సినిమా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్, మాస్ రాజా రవితేజలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మల్టీస్టారర్ మూవీని వీరిద్దరితో కలిసి చేయాలని డాలీ చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయనున్నాడట.
తమిళ చిత్రంలోని స్టోరీ లైన్ను తీసుకుని మిగతా కథను పూర్తిగా మార్చేందుకు డాలీ రెడీ అవుతున్నాడు.మరి ఈ మల్టీస్టారర్ మూవీ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.