మాస్ రాజా రవితేజ డిస్కోరాజా చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకుందామిన అనుకున్నాడు.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు తన ఫోక్స్ మొత్తం క్రాక్ చిత్రంపైనే పెట్టాడు.
ఈ సినిమా కూడా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టిన రవితేజ, వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.
గతంలో రవితేజకు వీర వంటి చిత్రాన్ని అందించిన రమేష్ వర్మ, ఇప్పుడు మరోసారి రవితేజతో అదిరిపోయే సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఆయనకు ఓ కథ వినిపించగా అది బాగా నచ్చిన రవితేజ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కానీ ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదట.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో సరైన నిర్మాత దొరకడం లేదట.
దీంతో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రవితేజ మరింత సమయం అడిగాడట.అన్నీ కుదిరాకే ఈ సినిమాను ప్రారంభించాలని రమేష్ వర్మను కోరాడట.
అయితే ఈ సినిమాను ఎలాగైనా పట్టాలెక్కించి తీరుతానని దర్శకుడు అంటుండగా, ఈ సినిమాను ప్రొడ్యూసర్ను వెతికే పనిలో పడ్డాడట.కానీ రమేష్ వర్మ ట్రాక్ చూసి నిర్మాతలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
మరి ప్రారంభానికి ముందే అటకెక్కిన ఈ సినిమా భవిష్యత్తులోనైనా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.ఇక తన నెక్ట్స్ మూవీ క్రాక్ను లాక్డౌన్ ముగియగానే రిలీజ్ చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు.