మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇక ఇందులో రవితేజకి జోడీగా పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇద్ది పీరియాడికల్ డ్రామాతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే హ్యాట్రిక్ లతో ఉన్న రవితేజకి కచ్చితంగా ఈసినిమాతో హిట్ కావాలి.ఈ సినిమా తర్వాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తాడని టాక్ ఉంది.
అయితే ఊహించని విధంగా రవితేజ ఇప్పుడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.
త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.మహా సముద్రం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం.
ఈ సినిమాలో రవితేజ మరో సారి స్టార్ హీరోయిన్ కాజల్ తో రొమాన్స్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఎలాంటి ఆర్బాటం లేకుండా ఈ సినిమాని దర్శకుడు మొదలెట్టినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.