మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.వరుసగా సినిమాలు చేస్తున్న మాస్ రాజా ఈ సినిమాను కూడా చాలా స్పీడుగా రెడీ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు.
కానీ ఆయన అనుకున్నది జరగలేదు.క్రాక్ సినిమా చివరి దశకు చేరుకుని చిక్కుల్లో పడింది.
ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్కు ముందే ఈ సినిమా షూటింగ్ ముగియాల్సి ఉంది.కానీ అది కుదర్లేదు.
క్రాక్ సినిమా షూటింగ్ ఇంకో 5-6 రోజుల్లో ముగుస్తుందనే సమయంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.ఈ షూటింగ్ ముగిస్తే, వెంటనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వేసవి కానుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించారు.
కానీ తానోటి తలిస్తే దైవం మరోటి తలిచిందనే చందాన, ఈ సినిమాను వేసవిలోనే రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూసిన చిత్ర యూనిట్కు అది కాని పనిగా మారింది.ఇక లాక్డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా షూటింగ్ను ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్లో గతంలో బలుపు, డాన్ శీను సినిమాలు రాగా అవి సూపర్ హిట్గా నిలిచాయి.
ఇక క్రాక్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.