మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక బలుపు, డాన్ శీను వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ఇదెలా ఉంటుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
ఈ సినిమా టీజర్ శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ను దక్కించుకోవడంతో ఈ సినిమా కథను ఇదివరకు ఎక్కడో చూసినట్లు ఉంది అని అందరూ అనుకున్నారు.కాగా తమిళంలో విజయ్ సేతుపతి నటించిన సేతుపతి చిత్రాన్ని తెలుగులో గంటా శ్రీనివాస్ రావు తనయుడు గంటా రవితేజ హీరోగా నటించిన జయదేవ్ సినిమాగా రీమేక్ చేశారు.
కాగా ఇప్పుడు అదే సినిమాను కొన్ని మార్పులు చేసి మనముందుకు తెస్తున్నాడట దర్శకుడు.
ఈ వార్త కనుక నిజమైతే మాస్ రాజాకు మరో ఫ్లాప్ పడటం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
ఏదేమైనా ఇలా ఉన్న కథనే అటు ఇటు తిప్పి తీసుకురావడం ఏమిటి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్కుమార్, సముథిరకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.