ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండేటట్లు చేసింది.బయటికి వెళ్లి తమ జీవనాన్ని గడుపుకోడానికి కూడా అడ్డు గా మారింది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కరోనా వైరస్ భయంతో తమ పనులను వదులుకొని ఉంటున్నారు.ఇక ఈ సారి వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై బాగా ప్రభావం చూపింది.
కరెక్ట్ సమయంలో సినిమాల విడుదలకు, షూటింగ్ లకు దెబ్బతీసింది.
ఇప్పటికే ఎన్నో సినిమా షూటింగులు వాయిదా పడగా.
థియేటర్ల ప్రవేశం నిలిపివేశాక సినిమా విడుదలలు కూడా వాయిదా పడ్డాయి.ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించి విడుదలకు సిద్ధంగా ఉండగా అన్ని వాయిదా పడ్డాయి.
ఇక కొన్ని చిన్న చిన్న సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి ముందుకు వస్తున్నాయి.అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా కొన్ని ఓటీటీ లో విడుదల అవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా రవితేజ సినిమా కూడా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ‘ సినిమా తెరకెక్కనుంది.డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.మే 28న ఈ సినిమాని విడుదల చేయడానికి సినీ బృందం డిసైడ్ అవగా ప్రస్తుతం పరిస్థితుల వల్ల వాయిదా పడింది.
ఇక తాజాగా ఈ సినిమాకు స్క్రీమింగ్ హక్కులపై ఓటిటి డీల్ తో ఒప్పందం జరిగిందట.
మామూలుగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చెయ్యాలి కానీ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేసినందుకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట.
దీంతో ఈ సినిమా ఓటిటి లో విడుదల కానుందని తాజా సమాచారం.ఇక రవితేజ గతంలో నటించిన ట్రాక్ సినిమా కూడా ఆహా లో విడుదల కాగా మంచి సక్సెస్ ను అందుకుంది.
ఇక ఈ సినిమా కూడా ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.